VVM Scholarship 2025: ఏపీ విద్యార్థులకు నెలకు ₹2,000 స్కాలర్‌షిప్

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విజ్ఞాన్ మంథన్ స్కాలర్‌షిప్ 2025 – నెలకు ₹2,000 + ₹25,000 బహుమతి | ఇప్పుడే అప్లై చేయండి





 AP: రాష్ట్రంలోని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం మరియు విగాన్ ప్రచార సంస్థ నిర్వహిస్తున్న “విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (VVM)” 2025 పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ పోటీ పరీక్షలో రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయిలో ఎంపికయ్యే వారికి స్కాలర్‌షిప్‌తో పాటు నగదు బహుమతులు అందజేయనున్నారు.


ముఖ్యమైన విషయాలు:

 తరగతులు: 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు
 పరీక్ష రకం: ఆన్‌లైన్ మోడ్‌లో సైన్స్ పరీక్ష
 అప్లికేషన్ ఫీజు: ₹200 మాత్రమే
 చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2025
 అధికారిక వెబ్‌సైట్: www.vvm.org.in


ఎగ్జామ్ డేట్లు:

విభాగంతరగతులుపరీక్ష తేదీలు
జూనియర్6 – 8అక్టోబర్ 28 – నవంబర్ 2
సీనియర్9 – 12నవంబర్ 19 – నవంబర్ 23

బహుమతులు:

 జాతీయ స్థాయి విజేతలకు ₹25,000 నగదు బహుమతి
 భాస్కరా స్కాలర్‌షిప్ ద్వారా నెలకు ₹2,000 (1 సంవత్సరం పాటు)
 రాష్ట్ర స్థాయిలో విజేతలకు ₹2,000 నుంచి ₹5,000 వరకు నగదు బహుమతులు


అప్లై చేయాల్సిన వారు:

ప్రస్తుతం 6వ తరగతి నుంచి 12వ తరగతిలో చదువుతున్న ఏపీ విద్యార్థులు
సైన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారు


Vidyarthi vigyan manthan vvm apply online

వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.vvm.org.in
"Student Registration" క్లిక్ చేయండి
స్కూల్ లేదా స్వయంగా ఫారం నింపండి
₹200 ఫీజు పేమెంట్ చేయండి
పరీక్ష తేదీకి ముందు స్టడీ మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సిద్ధంగా ఉండండి